సర్పంచ్ పదవి కోసం కూతురినే చంపేశాడు
NEWS Feb 02,2026 06:42 pm
ఎన్నికల్లో పోటీ చేయాలనే దురాశతో ఓ తండ్రి కన్న కూతురునే కడతేర్చిన దారుణం. మహారాష్ట్రలో ముగ్గురు పిల్లలు ఉంటే సర్పంచ్ పదవికి అనర్హత అనే నిబంధన ఉండటంతో, అడ్డంకి తొలగించుకునేందుకు నిందితుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ముఖేడ్కు చెందిన వ్యక్తి తన పెద్ద కూతురు ప్రాచీని నిజామాబాద్ D ఎడపల్లి M ఏఆర్పీ క్యాంపు సమీప నిజాంసాగర్ డీ-46 కెనాల్లో తోసి హత్య చేశాడు. జనవరి 30న బాలిక మృతదేహం లభ్యమవ్వడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి, తండ్రే హంతకుడని తేల్చారు. ముగ్గురు పిల్లల్లో ఒకరిని దత్తత ఇవ్వాలని విఫలయత్నం చేసిన అనంతరం ఘాతుకానికి పాల్పడ్డాడు.