బడ్జెట్ తెలంగాణకు అన్యాయం: ఏంబరి
NEWS Feb 02,2026 06:45 pm
నిర్మల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పూర్తిగా తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఉందని ఏంబరి రాజేశ్వర్ విమర్శించారు. దేశ అభివృద్ధి, పన్నుల వసూళ్లు, వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ కేంద్రం రాష్ట్రంపై నిరంతరం వివక్ష చూపడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుండడం కేంద్రానికి నచ్చడం లేదని, ఈ అన్యాయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వివక్ష వైఖరిని విడనాడి తెలంగాణకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.