డ్రైవర్ల నిర్లక్ష్యంపై కోమళ్లపూడి మహిళల ఆవేదన
NEWS Feb 02,2026 12:11 am
నర్సీపట్నం–చోడవరం మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులు బస్స్టాప్ వద్ద ఆపకపోవడంపై కోమళ్లపూడి గ్రామానికి చెందిన మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయం దేవాలయ దర్శనానికి వెళ్లేందుకు బస్సు కోసం ఎదురు చూసిన మహిళలను ఏపీ 31 20223 - 2583 నంబర్ల ఆర్టీసీ బస్సులు ఆపకుండా వెళ్లిపోయాయని తెలిపారు. చివరకు ఆటో ద్వారా ప్రయాణం చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ఘటనపై సీసీ కెమెరా ఆధారాలతో డిపో అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మహిళలు కోరారు.