భారత్తో మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నాం: పాక్
NEWS Feb 01,2026 09:40 pm
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా టీమిండియాతో మ్యాచ్ను బహిష్కరించాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే, టోర్నీలో మిగతా మ్యాచ్లను మాత్రం ఆడతామని తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాక్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచ కప్నకు భారత్, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్ మ్యాచ్లు కొలంబోలో షెడ్యూల్ చేసిన విషయం తెలిసిందే. పొట్టి కప్లో ఆడేందుకు ఇప్పటికే పాక్ తన జట్టును ప్రకటించింది.