కేసీఆర్తో నాలుగున్నర గంటల విచారణ
NEWS Feb 01,2026 09:36 pm
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. కేసీఆర్ నివాసంలో నాలుగున్నర గంటలకు పైగా సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ విచాణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేశారు. విచారణ అనంతరం నందినగర్ నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకున్నారు. బాల్కనీలో నిలబడి పార్టీ శ్రేణులకు కేసీఆర్ అభివాదం చేశారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించారు. పార్టీకి క్షేత్రస్థాయిలో చాలా బాగా ఉందన్నారు.