పాక్పై విజయం.. సెమీస్కు భారత్
NEWS Feb 01,2026 09:24 pm
U19 World Cupలో భారత్ సెమీస్కు దూసుకెళ్లింది. సూపర్ సిక్సెస్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్య ఛేదనలో పాక్.. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది. ఉస్మాన్ (66), హంజా (42), ఫర్హాన్ (38) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో ఖిలాన్ పటేల్ 3, ఆయుష్ మాత్రే 3, అంబరీష్, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ తలో వికెట్ పడగొట్టారు. ఫిబ్రవరి 3న తొలి సెమీస్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్.. ఫిబ్రవరి 4న రెండో సెమీ ఫైనల్లో భారత్, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి.