9వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం జోరు
NEWS Feb 01,2026 09:32 pm
నిర్మల్ జిల్లా మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రచార పర్వం కొనసాగుతోంది. నిర్మల్ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ నుంచి నామినేషన్ వేసిన వెన్నెల రమేష్ మోతి నగర్, వాల్మీకి నగర్, బాగలవాడ, ఇందిరానగర్ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే వార్డులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.