మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. ఏలూరు వైసీపీ నేతల సమావేశంలో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతానని జగన్ ప్రకటించారు. ఏడాదిన్నర కాలం ప్రజల్లోనే ఉంటానన్నారు. ఇక నుంచి ప్రతి శనివారం రోజున ఒక్కో నియోజకవర్గం నేతలతో భేటీ అవుతానని చెప్పారు. ఏలూరు నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం మొదలుపెడుతున్నామన్నారు.