ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని నిర్మల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షులు రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సిదుగు భీమ్ రెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.