మోడీ సహాయం చంద్రబాబు సంతోషం
NEWS Jan 18,2025 03:27 am
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం రూ. 11, 440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఉక్కుతో చెక్కబడిన చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. ఈ సాయం దేశ నిర్మాణానికి దోహద పడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదని, పోరాటాలకు, త్యాగాలకు స్మారక చిహ్నమన్నారు.