ఈద్గా మినర్లను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డీఎస్పీకి వినతి
NEWS Dec 15,2024 03:53 pm
ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండలో ఈద్గా మినర్లను శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వారిని కఠినంగా శిక్షించాలంటూ మెట్పల్లి డీఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీల అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మత పెద్దలు, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.