పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఎంతో రాజకీయ అనుభవమున్న మీకు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు సంబంధించి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నానన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా మీ బీఆర్ఎస్ నేతలు మాపై చేస్తున్న ఆరోపణలు చేయడం సరి కాదన్నారు.