దొంగ నోట్ల ముఠా అరెస్ట్
NEWS Dec 15,2024 06:40 am
నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేస్తూ చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగ నోట్ల తయారీ ముఠాను కామారెడ్డి జిల్లా పోలీసులు గుట్టరట్టు చేశారు. ముఠాలో ఎనిమిది మందిని గుర్తించి ఆరుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ సింధు శర్మ తెలిపారు మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అంతర్ రాష్ట్ర ముఠాగా ఏర్పడి దొంగ నోట్ల తయారీ చేసి చెలామణి చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర కు చెందిన వారు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లదైంది.56లక్షలు స్వాదినం చేసుకున్నారు