శ్రీవారి లడ్డూ తయారీపై సిట్ దర్యాప్తు
NEWS Dec 15,2024 05:25 am
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ప్రారంభించింది. మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో లడ్డూ తయారీకి వస్తున్న పదార్థాలతో పాటు ప్రత్యేకించి నెయ్యిని పరిశీలించారు. నిన్న లడ్డూ , బూందీ పోటు, పిండి మర వద్ద ఉన్న ల్యాబ్ ను తనిఖీ చేశారు. ఈ సమాచారాన్ని సీబీఐ డైరెక్టర్ తో పాటు సుప్రీంకోర్టుకు అందజేయనుంది సిట్.