గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
NEWS Dec 15,2024 05:21 am
గ్రూప్ -2 పరీక్షల నిర్వహణకు నిర్మల్ జిల్లాలో పగడ్బందీ చర్యలు చేపట్టారు. నిర్మల్ పట్టణంలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా ,8080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదనే నిబంధన ఉండటంతో , అభ్యర్థులు గంట ముందు నుండే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్ సెంటర్లను ముసి వేయించారు.