ఘనంగా దత్త జయంతి వేడుకలు
NEWS Dec 15,2024 06:42 am
మల్యాల కేంద్రంలోని శ్రీ మటమాంజనేయ స్వామి సన్నిధానంలో శనివారం ఆలయ వ్యవస్థాపకులు మిట్టపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప దీక్షాపరులు వేణు, అశోక్, రమేష్, గంగన్న, ఆంజనేయులు, మోహన్, తదితరులు పాల్గొన్నారు.