బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం
NEWS Dec 13,2024 04:08 am
కామారెడ్డి జిల్లాలో 500 నకిలీ నోట్ల కలకలం రేపుతుంది. బాన్స్ వాడ కేంద్రంగా నకిలీ నోట్ల దందా చేస్తున్న ముఠాపై పోలీసులు విచారణ చేపట్టారు. ముఠాలో 5గురు సభ్యులుగా గుర్తించారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ఓ వ్యాపారి నుండి నకిలీ నోట్లు స్వాదినం చేసుకున్న సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా వ్యాపారినిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దొంగనోట్ల తీగను లాగుతున్న పోలీసులు బాన్స్ వాడ, బిచ్కుందలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.