మహా పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే
NEWS Dec 13,2024 04:09 am
జుక్కల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన మహా పడిపూజలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మాల ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠలతో దీక్ష చేయడం అందరికీ సాధ్యం కాదన్నారు. అతికొద్ది మందికే ఈ అవకాశం రావడం వారి అదృష్టం అన్నారు.నియోజకవర్గం ప్రేమ, ఆప్యాయతలు, ఆధ్యాత్మకతకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు. అయ్యప్ప ఆశీర్వాదంతో నియోజకవర్గం అభివృద్ధికి బాటలు వేసుకుందామన్నారు.