గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు పకడ్బందీ చర్యలు
NEWS Dec 12,2024 11:33 am
గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ లో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 8080 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. 15న ఉదయం 10:00 నుండి 12:30, వరకు మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు, అలాగే 16న ఉదయం10:00 గంటల నుండి 12:30 వరకు, మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.