17న పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు
NEWS Dec 12,2024 11:25 am
శాసనసభ్యులు, పెట్టుబడిదారుల కోరిక మేరకు ఈనెల 17న విజయవాడలో పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ది కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఇందు కోసం కొత్తగా పర్యాటక పాలసీని విడుదల చేయడం జరిగిందన్నారు.