ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన కలెక్టర్
NEWS Dec 12,2024 10:41 am
మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. సర్వేలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రజా పాలన దరఖాస్తు ఆధారంగా పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్, ఎంపీడీవో, హౌసింగ్ డీఈ, పంచాయతీ కార్యదర్శి తదితరులున్నారు.