ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలన
NEWS Dec 12,2024 11:48 am
మెట్ పల్లి పట్టణంలోని 3, 4వ వార్డుల్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను గురువారం మున్సిపల్ కమిషనర్ మోహన్ పరిశీలించారు. ఇల్లు లేని నిరుపేదలు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా మున్సిపల్ సిబ్బంది ఇందిరమ్మ ఇళ్ల సర్వే పగడ్బందీగా చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట ఎస్ఐ అక్షయ్, ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ విష్ణు, ముజీబ్, శివ, గంగాధర్, ప్రగతి, నవీన్ ఉన్నారు.