మెట్పల్లిలో వెల్లుల్ల వాసుల రాస్తారోకో
NEWS Dec 12,2024 11:53 am
మెట్ పల్లి: వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖలో కలపవద్దని పాత బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై గ్రామస్థులు రాస్తారోకో నిర్వహించారు. గో బ్యాక్.. గో బ్యాక్ ఎండోమెంట్ గో బ్యాక్, వద్దురా నాయన ఎండోమెంట్ పాలన అంటూ.. నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.