ఆశా వర్కర్ల ఆందోళన వెనుక రాజకీయ కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు మంత్రి దామోదర రాజ నరసింహ. వారి ఉచ్చులో పడవద్దని కోరారు. ప్రభుత్వం ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. ధర్నా చౌక్ ను మాయం చేసిన వాళ్లు ఆశాలకు అండగా ఉంటామని అనడం విడ్డూరంగా ఉందన్నారు.