బాన్సువాడ ఏఎంసీ ఛైర్మన్ గా అంజవ్వ
NEWS Dec 11,2024 05:07 pm
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా ఇబ్రహీంపేట్ కు చెందిన మంత్రి అంజవ్వ గణేష్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి అంజవ్వ ఇదివరకు ఎంపీటీసీగా పని చేశారు. వైస్ ఛైర్మన్ గా బాన్సువాడ మాజీ ఉపసర్పంచ్ ఖాలేక్ తో పాటు డైరెక్టర్లను నియమించారు.