ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పూర్తి చేయాలి
NEWS Dec 12,2024 11:59 am
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తదితరులతో కలిసి మంత్రి పొంగులేటి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.