ట్రస్మా నూతన అధ్యక్షుడిగా గంగాధర్
NEWS Dec 11,2024 03:53 pm
మల్యాల మండల స్థాయి ట్రస్మా కార్యవర్గంను మల్యాలలో ట్రస్మా రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ కిషన్ రావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా తాటిపల్లి గ్రామానికి చెందిన ఎనగందుల గంగాధర్, గౌరవ అధ్యక్షులుగా విశ్వనాల దయానంద్, సాయిరాం, ఉపాధ్యక్షుడిగా సత్యనారాయణ, కార్యదర్శిగా విజయన్, కోశాధికారిగా అనిల్ కుమార్, సభ్యులుగా మహేష్, నరేషకుమార్, తిరుపతి ఎన్నికయ్యారు.