సంధ్యా థియేటర్ ఓనర్ పిటిషన్
NEWS Dec 11,2024 08:51 am
రేవతి మృతితో తమకేం సంబంధం అంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సంధ్య థియేటర్ ఓనర్ రేణుకాదేవి. అల్లు అర్జున్, రష్మికా మందన్నా కలిసి నటించిన పుష్ప-2 ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే అభిమాని మృతి చెందారు. ప్రీమియర్, బెనిఫిట్ షోలకు సర్కారే అనుమతి ఇచ్చిందన్నారు. డిస్ట్రిబ్యూటర్లదే తప్పంటూ పేర్కొన్నారు.