పీఏ..పీఆర్ఓల వల్లే చిక్కులు
NEWS Dec 11,2024 07:06 am
ప్రజా ప్రతినిధులు ప్రజలకు మధ్య దూరం పెరగడానికి ప్రధాన కారణం వాళ్ల వద్ద పని చేసే పీఏలు, పీఆర్ఓలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఎమ్మెల్యేల కోసం ఎవరైనా ఫోన్ చేస్తే వీళ్లు ప్రజలతో దురుసుగా మాట్లాడతారంటూ ఆరోపించారు. కాబట్టి ఏమైనా పనులు ఉన్నట్లయితే స్వయంగా ప్రజా ప్రతినిధులతో మాట్లాడాలని సూచించారు.