శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో సాగు నీటి కోసం ఆయకట్టు రైతులు అనేక పాట్లు పడే పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ప్రాజెక్ట్లో నీరు నిండుగా ఉంది. ప్రాజెక్ట్ నీరు లీకేజీల రూపంలో గంగ (గోదావరి) పాలవుతోంది. అధికారులు చర్య లు చేపట్టడం లేదు. ప్రాజెక్ట్ నుంచి మిగులు జలా లను వదులుటకు నిర్మించిన వరద గేట్ల ద్వారా నీరు లీకేజీ అవుతోంది.