సర్వే బాధ్యతల నుంచి తప్పించాలి
NEWS Dec 11,2024 08:53 am
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించే సర్వే బాధ్యతల నుంచి తమను తప్పించాలని పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఎంపీడీవోలు, డీపీవో, జిల్లా కలెక్టర్కు సర్వేను తాము నిర్వహించలేమని స్పష్టం చేస్తూ వినతి పత్రాలను అందించారు. పంచాయతీ కార్యదర్శులు సర్వే చేయబోమని వెల్లడించడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక సర్వేకు బ్రేక్ పడినట్లు అయ్యింది. ఒక్కో నియోజకవర్గానికి తొలి విడతలో 3,500 చొప్పున ఇండ్లను నిర్మించడానికి సాయం అందించనున్నట్లు తెలిపారు.