చదువుతోపాటు పరిశోధనలపై దృష్టి
NEWS Dec 11,2024 04:04 pm
విద్యార్థుల జీవితంలో సమయం చాలా ముఖ్యమైనదని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్లే విజేతలుగా నిలబడతారని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ ఆరతి పేర్కొన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు చదువుతోపాటు పరిశోధనలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వర్సిటీలోని వనరులను వినియోగించుకొని అత్యుత్తమంగా ఎదగాలన్నారు. సహజంగా ప్రతి విద్యార్థికి తెలివితేటలు ఉంటాయని, వాటిని బాధ్యతగా ఉపయోగించుకున్న వాళ్లే జీవితంలో స్ధిరపడతారని అన్నారు.