పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి
NEWS Dec 11,2024 04:05 pm
రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం హామీ ఇచ్చిన విధంగా ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.వశిష్ట డిగ్రీ కళాశాలలో ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు 9 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలన్నారు. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయులకు పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం సరికాదన్నారు. గ్రాట్యుటీ, జీపీఎఫ్ డబ్బులు విడుదల చేయాలన్నారు.