బదిలీ అయిన అటెండర్కు సన్మానం
NEWS Oct 17,2024 11:25 am
మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి జగిత్యాలలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు బదిలీ అయిన అటెండర్ భూలక్ష్మిని మెట్పల్లి డిగ్రీ కళాశాలలో శాలువాతో సత్కరించారు. అటెండర్గా అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకయ్య, లెక్చరర్లు దేవన్న, రాజేందర్, మనోజ్ కుమార్, గట్టయ్య, అంజయ్య, శ్రీకాంత్, సత్తయ్యలతో పాటు బోధనేతర సిబ్బంది లక్ష్మీనారాయణ, బాబు, లింగం తదితరులున్నారు.