ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
NEWS Oct 15,2024 01:07 pm
భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. సుబ్బంపేట గ్రామం వద్ద బైక్ పై వెళ్తున్న ముగ్గురుని లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు.