శబరిమలకు పాదయాత్ర చేస్తున్న అయ్యప్ప స్వాములు
NEWS Oct 15,2024 04:02 am
మెట్పల్లి నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు పాదయాత్ర చేపట్టారు. సుమారు 1600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర ఉన్నట్లు గురుస్వామి పోతుగంటి రాజేందర్ తెలిపారు. రాజేందర్ గురుస్వామి ఆధ్వర్యంలో తొలిసారి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు, దీనికిగాను 40 మంది స్వాములను పాదయాత్రలకు తీసుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్ర మెట్పల్లి, వేములవాడ, సిరిసిల్ల, బెంగళూరు నుండి శబరిమలకు బయలుదేరినట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో మధ్య మధ్యలో ఎవరైనా దాతలు ఉంటే సహాయం చేకూరుస్తారు. లేదంటే సొంతంగా తీసుకెళ్తానని నిశ్చయించుకుంటారు.