పాక్ ఓటమి.. భారత్ కు బిగ్ షాక్
NEWS Oct 14,2024 05:45 pm
మహిళల టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు పోరాటం ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో 54 రన్స్ తేడాతో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. దీంతో భారత్, పాక్ టోర్నీ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. 111 రన్స్ టార్గెట్ తో ఛేజింగ్ కు దిగిన పాక్ 11.4 ఓవర్లలో 56 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కాగా గ్రూప్-A నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్ లో పాగా వేయగా తాజాగా న్యూజిలాండ్ బెర్తు ఖరారు చేసుకుంది.