కొండగట్టుకు వాహన పూజలతో వచ్చిన ఆదాయం
NEWS Oct 14,2024 05:39 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో దేవీ నవరాత్రుల సందర్భంగా వాహన పూజల ద్వారా 3 రోజులకు గాను రూ. 3,37,900 నగదు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి తెలిపారు. గత ఏడాది రూ. 2,67,600 నగదు వచ్చిందని, గత ఏడాదితో పోల్చుకుంటే రూ. 70,300 నగదు ఎక్కువగా సమకూరిందని పేర్కొన్నారు.