బంగ్లాదేశ్తో మూడో భారత్ విజయం
NEWS Oct 12,2024 06:30 pm
బంగ్లాపై భారత్ ఘన విజయం సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని 133 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడించింది. చివరి టీ20లోనూ విజయఢంకా మోగించి 3 మ్యాచ్ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసింది. 298 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లా బోల్తా కొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులకు పరిమితమైంది. లిటన్దాస్ (42), హిర్దోయ్ (63*) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది.