పరువులేని నాగార్జున: సీపీఐ నారాయణ
NEWS Oct 12,2024 05:25 pm
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు వేశారు. ఎవరైనా పరువు కలిగినోళ్లు పరువునష్టం దావా వేస్తారు కానీ పరువులేని నాగార్జున పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ, నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. అన్నారు