ఢిల్లీ: ఎర్రకోట దగ్గర మాధవ్ దాస్ పార్కులో దసరా ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది, ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాముడి వేషధారణలో ఉన్న వ్యక్తికి రాష్ట్రపతి తిలకం దిద్దగా, మోదీ హారతి పట్టారు. ఆ తర్వాత వేడుకలు ప్రారంభమయ్యాయి. మైదానంలో ఏర్పాటు చేసిన రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుల బొమ్మలను తగలబెట్టారు. రాముడి వేషధారణలో ఉన్న వ్యక్తి.. బాణాలు వేసి.. బొమ్మలను తగలబెట్టారు.