40 బంతుల్లోనే సంజు శాంసన్ సెంచరీ
NEWS Oct 12,2024 03:46 pm
టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 మ్యాచ్ కు వేదికైన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సంజూ శాంసన్ స్వైరవిహారం చేశాడు. ఓపెనర్ గా బరిలో దిగిన శాంసన్ 40 బంతుల్లోనే 100 పరుగులు చేసి వావ్ అనిపించాడు. అంతకుముందు, రిషాద్ హుస్సేన్ విసిరిన ఓ ఓవర్లో శాంసన్ వరుసగా 5 సిక్సర్లు బాదాడు. శాంసన్ బాదుడుకు బంగ్లా బౌలర్లు విలవిల్లాడారు.