టేక్మాల్ మండల కేంద్రంలోని మహంకాళి ఆలయంలో విజయదశమి పండగను పురస్కరించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారి సుధీర్ శర్మ మహంకాళి అమ్మవారికి ప్రత్యేక అర్చనను జరిపారు. అలాగే భక్తులు వాహనాలకు పూజలు జరిపి వారి మొక్కులను చెల్లించుకున్నారు. అనంతరం పూజారి భక్తులకు తీర్ధప్రసాదలు అందచేశారు.