దసరా పండగ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సందడి చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామస్థులు సీఎంకి బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో స్వాగతం పలికారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో మోడల్ గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పలు పనులకు శంకుస్థాపన చేస్తున్నారు.