భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గిన్నెలగూడెం గ్రామంలో పండగ పూట విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బిజ్జా రజిత(25) ఇంట్లో విద్యుత్ హీటరకు ప్రమాదవశాత్తు తగిలి కరెంట్ షాక్ గురై మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బయ్యారం పోలీసులు విచారణ చేపట్టారు.