దసరా రోజు APకి కేంద్రం గుడ్న్యూస్
NEWS Oct 12,2024 09:23 am
కేంద్రం నుంచి ఏపీకి మరోసారి నిధులు విడుదల అయ్యాయి. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ పన్నుల వాటా కింద రాష్ట్రానికి రూ.7211 కోట్లు విడుదల చేసింది. మళ్లీ కేంద్రం నుంచి ఏపీకి నిధులు విడుదల అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం తొలి విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. ఏపీలోని స్థానిక సంస్థల కోసం తొలివిడతగా రూ.593.26 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీలోని పంచాయతీలు, స్థానిక సంస్థలకు ఈ నిధులు అందించనున్నారు.