దసరా రోజు ఒకరికొకరు ఇచ్చుకునే శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఆకులను బంగారం అంటారు. రాముడు లంకకు వెళ్లేముందు ఈ మొక్కను పూజించాడు. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు ఆయుధాలను ఈ చెట్టు మీద పెట్టి శమీ వృక్షాన్ని పూజిస్తారు. ఆ ఆయుధాలను తీసుకుని యుద్దంలో గెలుస్తారు. అందుకే ఈ చెట్టును దసరా నాడు పూజిస్తే అపజయాలు కలగవని నమ్ముతారు.