మెట్పల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన బీసీ జేఏసీ సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేసిన అందరికీ నియోజకవర్గ బీసీ జేఏసీ ఛైర్మన్ పుప్పాల లింబాద్రి, కన్వీనర్ తోగిటి అంజయ్య కృతజ్ఞతలు తెలిపారు. సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న 4 మండలాల బీసీ నాయకులకు, యువతకు, మాజీ ప్రజా ప్రతినిధులకు తదితరులకు వారు ధన్యవాదాలు తెలిపారు.