కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటాం
NEWS Oct 09,2024 06:42 pm
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతిఒక్క కార్యకర్త, నాయకులకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా అండగా ఉండడం తమ బాధ్యత అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ అన్నారు. వేణుగోపాల్ పూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు లింగంపల్లి రాజు గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతుండగా బుధవారం రోజున కాంగ్రెస్ శ్రేణులు అయనను పరామర్శించారు. ప్రభుత్వం నుండి సహాయ సాకారాలు ఉంటాయని అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ నెరల్లా నరసింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.