మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరిగిన తాజా మ్యాచ్లో టీమ్ ఇండియా భారీ విజయం సాధించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ పోరులో 82 పరుగులు తేడాతో గెలుపొందింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. 19.5 ఓవర్లలో 90 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.